
‘వైశాలి’ సూపర్ హిట్ తర్వాత దర్శకుడు అరివళగన్తో కలసి ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఆది పినిశెట్టి చేస్తున్న చిత్రం ‘శబ్దం’. 7G ఫిల్మ్స్ శివ, ఆల్ఫా ఫ్రేమ్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, ఎస్ బానుప్రియ శివ సహ నిర్మాత.
ఇక తాజాగా ఈ చిత్రంలో ప్రముఖ సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ కీలక పాత్ర పోషిస్తున్నారని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రం లొ ఆది పినిశెట్టి, లక్ష్మి మీనన్, లైలా, సిమ్రాన్ తదితరులు నటిస్తుండగా స్టార్ మ్యూజిక్ కంపోజర్ ఎస్ ఎస్ తమన్ దీనికి సంగీతం అందిస్తున్నారు.
